క్యాష్ లోన్ల విషయంలో ఆర్బీఐ షాకింగ్ డెసిషన్

దేశాన్ని డిజిటలైజేషన్‌ దిశగా నడిపించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది

నగదు రూపేణా రూ.20 వేలకు మించి రుణాలనూ ఇవ్వొద్దని NBFCలకు ఆర్బీఐ ఆదేశం

ఈ మేరకు ఓ లేఖను సెంట్రల్‌ బ్యాంక్‌ విడుదల చేసినట్లు తెలుస్తోంది

ఐటీ చట్టం 1961లోని సెక్షన్‌ 269ఎస్‌ఎస్‌ ప్రకారం రూ.20 వేలకు మించి నగదు లోన్ ఇవ్వరాదని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం

పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు కొరత దృష్ట్యా డిజిటల్‌ ఎకానమీపై కేంద్రం ఫోకస్ చేసింది

ఈ క్రమంలోనే ప్రతి చోట ఆన్‌లైన్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. అయినా కూడా మళ్లీ నగదు చలామణి పెరిగింది

కరెన్సీ లావాదేవీలు ఎప్పటిలాగే జరుగుతున్నాయి. దీంతో నగదు చలామణి కట్టడికి రూల్స్ మరింత కఠినం చేశారు

మరోవైపు పెరిగిన రిటైల్‌ రుణాల దృష్ట్యా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుందని కూడా అంటున్నారు