7 రోజుల పాటు..  ముల్తానీ మట్టిలో ఇవి  కలిపి రాసుకుంటే..

ముల్తానీ మట్టిలో బాదం ముక్కలను మిక్స్ చేసి మొఖానికి అప్లై చేస్తే  మృదువుగా మారుతుంది. 

పుదీనా ఆకులను ఈ మట్టిలో కలిపితే మొఖంపై మచ్చలు తొలగిపోతాయి.

ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపితే మొఖంలో మెరుపు వస్తుంది. 

ముల్తానీ మట్టిలో బొప్పాయి గుజ్జు, తేనె కలిపితే మొఖం కాంతివంతంగా మారుతుంది. 

గంధం పొడితో పాటూ టమాటా రసాన్ని ఈ మట్టిలో కలిపి రాసుకుంటే మచ్చలు పోయి మృదువుగా ఉంటుంది.

ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

వేప పేస్ట్‌ను ఈ మట్టిలో మిక్స్  చేసి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.