మోదీపై కేటీఆర్ సెటైర్లు

ప్రధాని మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు సంధించారు.  

ఈ దేశం కోసం ఏదైనా విజ‌న్ ఉంటే చెప్పండి.. కానీ స‌మాజంలో డివిజ‌న్ మాత్రం సృష్టించ‌కండి అని అన్నారు.

ప్ర‌ధానిగా తెలంగాణ ప్ర‌ధాన హామీల‌ను ఎందుకు మ‌రిచారో చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ద‌య‌చేసి ప‌విత్ర‌మైన ఈ నేల‌పై విషం చిమ్మ‌కుండా, ద‌శాబ్దాకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడ‌గాల‌న్నారు. 

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండంటూ ఘాటుగా స్పందించారు. 

రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు.. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా అని కేటీఆర్ పేర్కొన్నారు.