MLA Krishna Mohan Reddy: ఆ ఘటన అనుకోకుండా జరిగిపోయింది

ABN , First Publish Date - 2022-11-22T19:16:53+05:30 IST

జోగులాంబ గద్వాల జిల్లా: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపాల్‌పై దాడి అనుకోకుండగా జరిగిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ప్రారంభిస్తే ఏమైతది? అని ప్రిన్సిపాల్ అన్నందుకే కోప్పడాల్సి వచ్చిందని..

MLA Krishna Mohan Reddy:  ఆ ఘటన అనుకోకుండా జరిగిపోయింది

జోగులాంబ గద్వాల జిల్లా: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపాల్‌పై దాడి అనుకోకుండగా జరిగిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ప్రారంభిస్తే ఏమైతది? అని ప్రిన్సిపాల్ అన్నందుకే కోప్పడాల్సి వచ్చిందని.. కార్యకర్తలతో ప్రిన్సిపాల్ గొడవ పెట్టుకోవడంతోనే నేను అలా వ్యవహరించాల్సి వచ్చిందిని సంజాయిషి ఇచ్చుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

గద్వాల జిల్లాలో బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Bandla Krishnamohan Reddy), జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా (ZP Chairperson Sarita)ను అధికారులు ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే పాఠశాలను జడ్పీ ఛైర్‌పర్సన్ ప్రారంభించారు. నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక.. ప్రిన్సిపాల్ గల్లా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో మిగతా అధికారులు ఖంగుతిన్నారు.

Updated Date - 2022-11-22T19:16:54+05:30 IST