Share News

AP Election 2024: వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్

ABN , Publish Date - May 11 , 2024 | 02:58 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Election 2024) ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. నంద్యాల శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షించారు.

AP Election 2024: వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్
అల్లు అర్జున్

నంద్యాల: ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Election 2024) ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. నంద్యాల శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షించారు. సతీమణి స్నేహరెడ్డిని వెంటబెట్టుకొని స్వయంగా ఆయన నంద్యాలకు వెళ్లారు. శిల్పా రవి మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.


శిల్పారవి తనకు మంచి మిత్రుడని, తాము ఎప్పుడు కలిసినా అతడు నంద్యాల గురించే అలోచిస్తాడని అల్లు అర్జున్ అన్నారు. ‘‘ నా స్నేహితులు ఎక్కడ ఏ ఫీల్డ్‌లో ఉన్నా వాళ్ల కోసం వెళ్తా. శిల్పారవి 2019లో మొదటిసారి పోటీ చేసినప్పుడు నేను ఒక సందేశం మాత్రమే పంపాను. ఎమ్మెల్యే శిల్పా రవి వద్దన్నా కూడా నేనే అభినందించడానికి, విషెస్ చెప్పడానికి నంద్యాలకు వచ్చాను. ఇప్పుడు నేరుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శిల్పా రవిని మంచి మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అల్లు అర్జున్ అన్నారు.

ఇవి కూడా చదవండి

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!

AP Elections: అదనపు బస్సులు ఏర్పాటు చేయండి.. ఆర్టీసీ ఎండీకీ చంద్రబాబు లేఖ

Read Latest AP News And Telugu News


Updated Date - May 11 , 2024 | 03:02 PM