Share News

AP Elections: 48 గంటల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా

ABN , Publish Date - May 16 , 2024 | 08:23 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.

AP Elections: 48 గంటల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా

విశాఖపట్నం, మే 16: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇదే అంశంపై సదరు ఉన్నతాధికారులకు తాను ఇటీవల లేఖ సైతం రాసినట్లు చెప్పారు. గురువారం విశాఖపట్నంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంల లైవ్ టెలికాస్ట్‌ లింక్ కావాలని ఉన్నతాధికారులను కోరినట్లు వివరించారు.

IncomeTax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్


National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

అయితే లైవ్ లింక్ ఇవ్వమని వారు తనకు సమాధానం ఇచ్చారన్నారు. దీనిపై తమకు సందేహాలున్నాయని చెప్పారు. లైవ్ లింక్ ఇవ్వడం వల్ల జిల్లా ఎన్నికల అధికారికి వచ్చిన నష్టమేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఉన్నతాధికారులు.. ఈ లైవ్ లింక్ ఇవ్వకుంటే తదుపరి 48 గంటల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!


AP Elections: భారీ భద్రత మధ్య ‘జేసీ ఫ్యామిలీ’ హైదరాబాద్‌కు తరలింపు

విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతుంది. అందుకు తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ రూమ్‌ల లైవ్ లింక్ ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 08:23 PM