Share News

నెయ్యి.. నిప్పు!

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:40 AM

అగ్నికి ఆజ్యం (నెయ్యి) పోసేవాళ్లనే చూశాం! ఇప్పుడు... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ‘నెయ్యి’ వివాదానికే తన మాటలతో అగ్నిని జతచేశారు. నెయ్యి వివాదంపై మాట్లాడి సరిపెట్టకుండా... సున్నితమైన మత సంప్రదాయాలపైనా,

నెయ్యి.. నిప్పు!

లడ్డూ వివాదానికి ఆజ్యం పోసిన జగన్‌

హిందుత్వ, దేశంపై అనుచిత వ్యాఖ్యలు

ఇతర రాష్ట్రాలకు పాకిన నిరసనలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అగ్నికి ఆజ్యం (నెయ్యి) పోసేవాళ్లనే చూశాం! ఇప్పుడు... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ‘నెయ్యి’ వివాదానికే తన మాటలతో అగ్నిని జతచేశారు. నెయ్యి వివాదంపై మాట్లాడి సరిపెట్టకుండా... సున్నితమైన మత సంప్రదాయాలపైనా, దేశంపైనా ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్‌ వ్యతిరేక ఆందోళనలు ఇతర రాష్ట్రాలకూ విస్తరించాయి. శనివారం గుజరాత్‌లోని 9జిల్లాల్లో జగన్‌ వ్యతిరేక ఆందోళనలు సాగాయి. జగన్‌పై చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ర్యాలీలు జరిగాయి. తెలంగాణలోనూ జగన్‌పై బీజేపీ నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకపోగా.. వితండ వాదంతో హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారంటూ ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. సీఎం చంద్రబాబును ఇరకాటంలోకి నెడదామనుకుని... తానే ఇరుక్కుపోయారని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 29 , 2024 | 05:40 AM