Share News

పక్కాగా ఫ్రీ హోల్డ్‌ భూముల రీవెరిఫికేషన

ABN , Publish Date - Aug 29 , 2024 | 11:47 PM

ఫ్రీహోల్డ్‌ పొందిన రైతుల భూ ముల రీవెరిఫికేషన పక్కాగా ఉం డాలని, వివరాలను ప్రత్యేక ఫా రంలో పూర్తి వివరాలతో నమోదు చేయాలని సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ రెవెన్యూ సిబ్బందిని ఆదేశాంచారు.

పక్కాగా ఫ్రీ హోల్డ్‌ భూముల రీవెరిఫికేషన
ఫ్రీహోల్డ్‌ భూరికార్డులు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌

మదనపల్లె అర్బన, ఆగస్టు 29: ఫ్రీహోల్డ్‌ పొందిన రైతుల భూ ముల రీవెరిఫికేషన పక్కాగా ఉం డాలని, వివరాలను ప్రత్యేక ఫా రంలో పూర్తి వివరాలతో నమోదు చేయాలని సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ రెవెన్యూ సిబ్బందిని ఆదేశాంచారు. గురువారం మండలంలోని వలసపల్లె, పప్పిరెడ్డిపల్లె, చిప్పిలి, కోళ్లబైలు గ్రామాల్లో ఫ్రీహోల్డ్‌ భూముల రీవెరిఫికేషనకు సంబంధించి తహసీల్దార్‌ ఖాజాబీతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు కలిగిన రైతులతో మాట్లాడారు. ఏ సమయంలో అసైనమెంట్‌ చేసింది. అనలైనలో ఎవరి పేరుతో ఉంది. ఫ్రీహోల్డ్‌ రైతు ఎవ్వరు, రిజిస్ట్రేషన ఎవరి పేరిట అయిం ది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను ప్రత్యేక ఫారంలో నమో దు చేయాల్సిందిగా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌తో పా టు ఆర్‌ఐ రెడ్డెప్ప, మండల సర్వేయర్‌ సుబ్రమణ్యం, వీఆర్వోలు నారాయణ, చంద్రమోహన, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:47 PM