ఆనంద ‘యోగ’ం
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:58 PM
మనస్సును ఏకాగ్రతంగా ఉంచడంలో ప్రధాన ఆయుధం యోగా. పురాతన కాలం నుంచి యోగా అందుబాటులో ఉన్నా మారుతున్న జీవనశైలి కారణంగా మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ దాల్ సరస్సు సమీపంలో స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి నిజాం కాలేజీ మైదానంలో యోగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యాసంస్థల్లో యోగా డే నిర్వహించారు.
Updated at - Jun 21 , 2024 | 03:58 PM