Share News

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:53 PM

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..
Lakshya SEN

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పురుషుల డబుల్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించగా.. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో విజయంతో పీవీ సింధు ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌ (రౌండ్ 16)కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్స్‌లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా క్రీడాకారుడు జోనాటన్ క్రిస్టీపై 21-18, 21-12 తేడాతో వరుస రెండు సెట్లను గెలుచుకున్నాడు.


పతకంపై ఆశలు..

బ్యాడ్మింటన్‌లో రెండు నుంచి మూడు పతకాలు వస్తాయని భారత్ ఆశలు పెట్టుకుంది. షూటింగ్‌లో ఇప్పటికే రెండు పతకాలు రాగా.. బ్యాడ్మింటన్‌లోనూ అదే సంఖ్యలో పతకాలు రావొచ్చని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తు్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్‌తో పాటు.. పురుషుల డుబల్స్‌లో పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురు ప్రస్తుతం లీగ్ దశను క్లియర్ చేసి.. నాకౌట్ దశకు చేరుకున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారులు 16వ రౌండ్‌కు చేరుకున్నారు. ఈ రౌండ్‌లో విజయం సాధిస్తే క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే మాత్రం బ్యాడ్మింటన్‌లో పతకం గ్యారంటీ అని అంచనా వేస్తున్నారు.


గత ఒలింపిక్స్‌లో..

గత టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది. తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లో ఓడిపోవడంతో కాంస్య పతకం సాధించింది. ఈసారి మాత్రం బ్యాడ్మింటన్‌లో ఎక్కువ పతకాలు వస్తాయని ఇండియా ఆశలు పెట్టుకుంది. ఆగష్టు ఒకటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆగష్టు2న బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్, ఆగష్టు3న బ్యాడ్మింటన్ ఫైనల్స్ జరుగుతాయి.


Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 03:05 PM