Share News

Pavitra: రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి

ABN , Publish Date - May 13 , 2024 | 05:18 AM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్‌ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఆ లేన్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నుజ్జయింది. పవిత్రది కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా ఉమ్మదహల్లి గ్రామం. ఆమెతో పాటు పినతల్లి కుమార్తె ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్‌ (చందు), డ్రైవర్‌ శ్రీకాంత్‌తో కలిసి శనివారం సాయంత్రం కారు (స్కార్పియో)లో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.

Pavitra: రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి

  • అదుప్పు తప్పి డివైడర్‌ను.. అవతలి లేన్‌లో బస్సును ఢీకొట్టిన కారు

  • డ్రైవర్‌, మరో ఇద్దరికి గాయాలు

  • భూత్పూర్‌ వద్ద ఘటన

  • త్రినయని, నిన్నే పెళ్లాడతా సీరియళ్లతో పవిత్రకు గుర్తింపు

భూత్పూర్‌, మే 12: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్‌ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఆ లేన్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నుజ్జయింది. పవిత్రది కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా ఉమ్మదహల్లి గ్రామం. ఆమెతో పాటు పినతల్లి కుమార్తె ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్‌ (చందు), డ్రైవర్‌ శ్రీకాంత్‌తో కలిసి శనివారం సాయంత్రం కారు (స్కార్పియో)లో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. కారు భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బీ) వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ని బలంగా ఢీకొట్టింది.


దాని మీదుగా రోడ్డు అవతలివైపు పడి హైదరాబాద్‌ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రకాంత్‌, ఆపేక్ష, శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవిత్ర ‘త్రినయని’ తెలుగు సీరియల్‌లో తిలోత్తమ అనే నెగటివ్‌ రోల్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్నే పెళ్లాడతా, స్వర్ణా ప్యాలెస్‌, కోడళ్లూ మీకు జోహార్లు సీరియళ్లలో ప్రతినాయిక పాత్రలతో మెప్పించారు. ‘జోకలి’ అనే కన్నడ సీరియల్‌తో నట జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలి పటా’, ‘రాధారమణ్‌’, ‘విద్యా వినాయక’ తదితర కన్నడ సీరియళ్లలో మంచిపేరు తెచ్చుకున్నారు. చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు కుమారుడు ప్రజ్వల్‌, కుమార్తె ఉన్నారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - May 13 , 2024 | 05:18 AM