Share News

సీఎంఆర్‌ఎఫ్‌కు గీతం వర్సిటీ విరాళం రూ. కోటి

ABN , Publish Date - Sep 23 , 2024 | 04:11 AM

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్‌ తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ(సీఎంఆర్‌ఎఫ్)నిధికి ఆదివారం కోటి రూపాయల చెక్కును అందజేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌కు గీతం వర్సిటీ విరాళం రూ. కోటి

హైదరాబాద్‌, పటాన్‌చెరు రూరల్‌, సెప్టెంబరు 22 : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్‌ తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ(సీఎంఆర్‌ఎఫ్)నిధికి ఆదివారం కోటి రూపాయల చెక్కును అందజేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసంలో ఆదివారం స్వయంగా కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శ్రీభరత్‌తో పాటు పూర్వ ఐఏఎస్‌ అధికారి గీతం ముఖ్య పరిపాలనాధికారి(సీఏవో) బీ.ఆర్‌. మీనా, గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి డీఎస్‌ రావు, కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ డీన్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌, గీతం రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎ్‌సఆర్‌ వర్మ తదితరులున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 04:11 AM