Share News

kondagattu: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 28 , 2024 | 01:37 PM

కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు మంగళవారం. అలాగే వేసవి సెలవు రావడంతోపాటు హనుమాన్ జయంతికి ముందే స్వామి వారి భక్తులు దీక్షలు విరమిస్తున్నారు.

kondagattu: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

కొండగట్టు, మే 28: కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు మంగళవారం. అలాగే వేసవి సెలవు రావడంతోపాటు హనుమాన్ జయంతికి ముందే స్వామి వారి భక్తులు దీక్షలు విరమిస్తున్నారు.

దీంతో కొండగట్టు ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఆ క్రమంలో భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లు నిండిపోయాయి. భక్తుల జై శ్రీరామ నినాదాలతో కొండగట్టు ప్రాంతం మార్మోగుతుంది. ఇక భక్తుల రద్దీతో కొండగట్టులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారం నుంచి ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు దేవాలయం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Updated Date - May 28 , 2024 | 06:07 PM