Share News

Road Accident: వనపర్తిలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:42 PM

వనపర్తి(Wanaparthy) జిల్లాలో బుధవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు మృతి చెందిన ఘటన రాజపేటలో చోటు చేసుకుంది.

Road Accident: వనపర్తిలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

వనపర్తి: వనపర్తి(Wanaparthy) జిల్లాలో బుధవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ద్విచక్రవాహనదారులు ఇద్దరు మృతి చెందిన ఘటన రాజపేటలో చోటు చేసుకుంది. ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్‌కి చెందిన వెంకటేష్, జడ్చర్లకు చెందిన రవి కుమార్ ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు.

ఈ క్రమంలో రాజపేట వద్దకు రాగానే వారి బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేష్, రవి కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 09:43 PM