Share News

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

ABN , Publish Date - May 14 , 2024 | 03:00 AM

తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన... మీడియాతో మాట్లాడారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒకటే. నా అనే వారికి ఎప్పుడూ మద్దతు ఇస్తా. మావయ్య పవన్‌ విషయంలోనైనా, మిత్రుడు శిల్పా రవిరెడ్డి విషయంలో అయినా. భవిష్యత్తులోనూ నా అనే వారికి ఇలానే మద్దతిస్తా.

శిల్పా రవి నాకు 15ఏళ్లుగా మిత్రుడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్‌ చేస్తానని మాటిచ్చా. 2019లో శిల్పా రవి రాజకీయాల్లోకి వచ్చినా.. కలవలేకపోయాను. అందుకే ఈసారి వెళ్లి కలిశా. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు’ అని అన్నారు. కాగా, శనివారం అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహరెడ్డితో కలసి నంద్యాలలో పర్యటించారు. పట్టణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్షన్‌ అమలులో ఉన్నప్పుడు ఆయన పర్యటించడంతో.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను అల్లు అర్జున్‌, శిల్పా రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 14 , 2024 | 03:00 AM