Share News

Telangana: మరికాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:32 PM

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఈ పరీక్ష ఫలితాలను ఇంటర్మిడియట్ బోర్డ్ ఉన్నతాధికారులు విడుదల చేయనున్నారు.

Telangana: మరికాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఈ పరీక్ష ఫలితాలను ఇంటర్మిడియట్ బోర్డ్ ఉన్నతాధికారులు విడుదల చేయనున్నారు. ఈ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలకు ఇంటర్ బోర్డ్ అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.


ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పరీక్ష ఫెయిల్ అయిన వారితోపాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం.. ఈ పరీక్షకు హాజరైన వారు ఉన్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగియి. అయితే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారి కోసం మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.

Updated Date - Jun 24 , 2024 | 01:40 PM