నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
డబ్బుల విషయంలో ఓ వ్యక్తిని ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించిన ఘటనలో టప్పాచబుత్ర ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, సివిల్ తగాదాల్లో తలదూర్చి ఒకరికి మద్దతుగా వ్యవహరించారన్న కారణంతో ఓ ఏఎస్ఐ సస్పెన్షన్కు గురయ్యారు.
కడలూరు(Kadaluru) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురినీ హతమార్చి, ఆనక వారి శవాలకు నిప్పంటించారు. ఓ ఇంట్లో దుర్గంధం రావడం గమనించిన చుట్టుపక్కల వారు... పోలీసులకు సమాచారం ఇవ్వగా, విషయం వెలుగుచూసింది.
డ్రగ్స్కేసులో కుమారుడు పట్టుబడ్డాడని తల్లిదండ్రులను బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వారి నుంచి రూ.50వేలు దోపిడీ చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకుడు, వీఎస్టీ కంపెనీ యూనియన్ మాజీ నాయకుడు పూస గోపాల్(77) శనివారం గుండెపోటుతో మృతి చెందారు.
నార్సింగ్ పోలీస్స్టేషన్(Narsing Police Station) పరిధిలోని బైరాగిగూడలో తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఓ బుల్లెట్ కలకలం రేపింది. ఆ బుల్లెట్ ధాటికి ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలాయి.
సోషల్ మీడియా(Social media) పిచ్చి ఓ వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా చేసింది. నిబంధనల ప్రకారం ట్యాక్స్ కట్టకుండా పది మద్యం సీసాలను గోవా నుంచి తీసుకువచ్చి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
డబ్బు మీద మమకారంతో కన్నప్రేమను మరిచాడో తండ్రి. తన రక్తం పంచుకు పుట్టిన కుమార్తె (18 రోజుల శిశువును)ను రూ.లక్షకు విక్రయించేశాడు. తనకు సహకరించకపోతే విడాకులిస్తానని భార్యను బెదిరించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
వర్క్ ఫ్రం హోం(Work from home) పేరుతో సైబర్ నేరగాళ్ల(Cybercriminals) చేతిలో ఓ మహిళ మోసపోయిన ఘటన శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలో నివసించే లహరి గృహిణి. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాక్ ఫ్రంట్ కాలనీలో నివసిస్తుంది.
కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.