Home » AP Congress
పోలవరం ప్రాజెక్ట్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ ,వైసీపీ పార్టీలే కారణమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party)లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన నిధుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా(Sharmila), ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (Sharmila) నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె .సి .వేణుగోపాల్కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకరపద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు.
ఏఐసీసీ అగ్రనేతలను నిన్న(సోమవారం) ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. ఏపీ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించిన విషయం తెలిసిందే. అయితే రేపటి(బుధవారం) నుంచి విజయవాడలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలపై కేడర్కు షర్మిల దిశానిర్దేశం చేస్తారు.
ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.
చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచార సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని తాజా ఎన్నికలు నిరూపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్ప ఏ నియోజకవర్గంలోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధులకు దక్కలేదు.
ఏపీ కాంగ్రెస్ (AP Congress) నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసింది. పార్టీపై, నేతలపై బహిరంగ విమర్శలు చేయకూదని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఆఫీస్ బేరర్లు ఇష్టానుసారంగా మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారని అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది.
: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు.
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.