Home » AP Secretariat
జిల్లా పరిషత్ ఆవరణలో గురువారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ ముగిసింది.
Andhrapradesh: అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఏకంగా సచివాలంలో వైసీపీ అనుకూల అధికారుల బరితెగింపులకు పాల్పడ్డారు. సస్పెన్షన్లో ఉన్న సచివాలయం ఉద్యోగి సంఘనాయకుడు వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం నుంచి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఒకటా రెండా కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్లో ఉంటూ వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు స్వరాష్ట్రానికి వెళ్తామా..? అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే గడిపేశారు. అయితే.. కూటమి సర్కార్ వచ్చిన రోజుల వ్యవధిలోనే..
సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది.
గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
గ్రామ, వార్డు సచివాలయాల, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.