Home » BCCI
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. గౌతమ్ గంభీర్ టీమిండియా కొత్త హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని కూడా ఆ సమయంలో గంభీర్ కండీషన్ పెట్టాడు. అనుకున్నట్టే తనతో గతంలో పని చేసిన వారిని సహాయక సిబ్బందిగా ఎంచుకున్నాడు.
టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ను బీసీసీఐ ప్రకటించింది. చెన్నై టెస్ట్కు ముందు నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఒక రోజు ముందు ఆయన పిక్స్ వెలుగులోకి వచ్చాయి. ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది.
రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్(samit dravid) భారత అండర్ 19లో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్ట్ అయినందుకు సమిత్ ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందో మీరు చూసేయండి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్లో రాణిస్తున్నాడు. బ్యాట్తోనే కాదు బాల్తో సత్తా చాటుతున్నాడు. సమిత్ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఐసీసీ ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్ క్లే పదవీ కాలం నవంబర్ 30వ తేదీతో ముగియబోతోంది. మళ్లీ పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేనట్టు బార్ క్లే ఇప్పటికే ఐసీసీ సభ్యులకు తెలియజేశాడు. దీంతో బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
అటు ఆటగాళ్లకు, ఇటు ఫ్రాంఛైజీలకు మరోవైపు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ (IPL). ప్రతి ఏడాది నిర్వహించే వేలంలో ఫ్రాంఛైజీ యజమానులు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటూ ఉంటారు. వారి ఫామ్ను బట్టి, వారికున్న డిమాండ్ను బట్టి కోట్లు గుమ్మరిస్తారు.
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్కప్లోనూ వైస్-కెప్టెన్గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్గా కొనసాగుతాడని..