Home » CM Siddaramaiah
ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది. ‘ముడా’ అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను ప్రాసిక్యూషన్కు అనుమతులు ఇచ్చిన గవర్నర్పై మూకుమ్మడిగా నాయకులంతా తిరగబడ్డా ఈ మద్దతు ఎంతకాలమనేది చర్చలకు దారితీస్తోంది.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్కు అనుమతించిన గవర్నర్ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మైసూరు అర్బన్ డెవలప్మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.
దేశంలో బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్) గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ శనివారం అనుమతులు ఇచ్చారు.
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.
కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.