Home » Election Results
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.
అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.
నాలుగు వందల పైచిలుకు లోక్సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 41 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఎన్నికల ఫలితాలు వస్తుండడం, ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ లభిస్తుండడంతో మదుపర్లు అప్రమత్తమవుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునాయాసంగా 300కు పైగా సీట్లు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇండియా కూటమికి 150 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని విశ్లేషకులకు కూడా షాకిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలకు దాదాపు రెట్టింపు సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ స్వంతంగా 100కు పైగా సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 2014లో కేవలం 44, 2019లో 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.