Home » Jayashankar Bhupalapally
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగులో రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాలీ డ్రైవర్ను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే బొలెరో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
Telangana: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.
Telangana: పోలీస్స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్స్టేషన్లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
Telangana: కాళేళ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Telangana: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పుట్ట నరసింహస్వామి అనే వ్యక్తి... నల్ల అవినాష్(25)పై కత్తితో దాడి చేశాడు. తన భార్యతో నల్ల అవినాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నడనే అనుమానంతో నర్సింహులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.