Home » Kotamreddy Sridhar Reddy
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
Andhrapradesh: ‘‘రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కల్గిన వ్యక్తి నేను’’ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం స్వర్ణాల చెరువులో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే రొట్టెలు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబే చెప్పారన్నారు.
ఏపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ వికెట్స్ ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇవాళ నెల్లూరు మేయర్ స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ టికెట్ను ఇచ్చారని.. గెలిచిన మీదట తనను మేయర్ను చేశారని తెలిపారు.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
నెల్లూరు: పెన్షన్ పంపిణీ విధానంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచాతినీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నెల్లూరు: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అధికార వైసీపీ నేతలు ఉచ్చానీచ్చాలు మరచి, బరితెగించి వ్యవహారిస్తున్నారని, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, సోషల్ మీడియా వేదికగా ఎక్కువైయ్యాయని మండిపడ్డారు.
ల్లూరు జిల్లా: జగన్ ప్రభుత్వం అరాచకాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతూ ఉండటంతో సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై అక్రమ కేసు బనాయించింది.
మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు.
నెల్లూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్లో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లని పరిశీలించారు. చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులు, వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు.