Home » MS Dhoni
ఎమ్ఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్లో ఆడతాడా? ఆడడా? అనే చర్చ అతడి అభిమానుల్లో జోరుగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ధోనీ తన సరికొత్త హెయిర్స్టైల్తో అభిమానులకు షాకిచ్చాడు. తన కెరీర్ ఆరంభం నుంచే ధోనీ తన హెయిర్తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.
సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఆ తర్వాతి తరంలో ధోనీ, కోహ్లీ, రోహిత్ మాత్రం టీమిండియా సారథులుగా తమదైన ముద్ర వేశారు. అయితే ఈ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఈ ప్రశ్నకు విండీస్ డాషింగ్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీని పిచ్చిగా అభిమానిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధోనీకి వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ధోనీ కోసం చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించాడు.
ధోనీ కెరీర్లో అతడి సోదరిదీ కీలక పాత్రే. ధోనీ క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే క్రమంలో తమ తండ్రిని ఒప్పించిందీ ఆమె సోదరేనని చెబుతారు.
టీమిండియా కెప్టెన్గా, ఉత్తమ వికెట్ కీపర్గా, బెస్ట్ ఫినిషర్గా ప్రపంచ క్రికెట్పై తనదైన ముద్ర వేశాడు మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ. ఎంతో మంది ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. అయితే 2004లో జింబాబ్వే, కెన్యా పర్యటనల్లో ధోనీ ఆడిన తీరే అతడు టీమిండియాలోకి ఎంటర్ కావడానికి కారణం.
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.
తన కుమారుడి అంతర్జాతీయ కెరీర్ను జీవితాన్ని ధోనీ సర్వ నాశనం చేశాడని ఇటీవల యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీపై యోగరాజ్ చేసిన సంచలన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయ్యాక టీమిండియా స్వరూపమే మారిపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ టీమ్గా ఎదిగింది. 2007, 2011 ప్రపంచకప్లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్లోనూ మెరుగ్గా ఆడింది. ఆ తర్వాత ధోనీ నుంచి కోహ్లీ పగ్గాలు అందుకున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ధోనీ అంటే ప్రత్యేక అభిమానం. ధోనీ సారథ్యంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగాడు. ధోనీ అంటే కోహ్లీకి ఇప్పటికీ అదే అభిమానం, గౌరవం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ధోనీ ఓ ఇంటర్వ్యూలో కోహ్లీతో అనుబంధం గురించి మాట్లాడాడు.