Home » Nandikotkur
నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, ఎంపీటీసీ లు టీడీపీలో చేరారు.
గ్రామాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు సూచించారు.
ఇది వైసీపీ కాదని...వర్గపోరు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే నందికొట్కూరు అభివృద్ధి సాధ్యమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవగానే పరిస్థితులు మారిపోయాయి. మున్సిపాలిటీ సమయం ఇంకా రెండేళ్లు ఉండటం, పైగా రాష్ట్రంలో టీడీపీ గెలిచి, వైసీపీ పూర్తిగా కుదేలైపోవటంతో ఇక్కడి కౌన్సిలర్లు పూర్తిగా ఆలోచనలో పడిపోయారు. దీనికి తోడు వైసీపీ ముఖ్య నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నియోజకవర్గంలో..
నంద్యాల జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు జిల్లాలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతల చేరికలతో టీడీపీ బలపడుతున్నా.. గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని, వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్ టీమ్లాగా 11 కే పరిమితం అయిన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి...
పగిడ్యాల( Pagidiala) మండలం ఘణపురం(Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..
Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..