Home » Notice
గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు ఇక ‘హైడ్రా’ ద్వారానే నోటీసులు జారీ చేయించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు కేంద్ర హోం శాఖ అమిత్షా రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 'సభా హక్కుల నోటీసు'ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.
కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విటర్(ఎక్స్) ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party)లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన నిధుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా(Sharmila), ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ(YSRCP Govt) నిర్వాకంతో ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(Neerabh Kumar Prasad) కు జాతీయ ఎస్టీ కమిషన్(National ST Commission) నోటీసులు జారీ చేసింది. జగన్(Jagan) ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్.. పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంపై అప్పట్లోనే జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాపట్ల జిల్లా: పట్టణంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసును ఆఫీస్ గోడకు మున్సిపల్ సిబ్బంది అంటించారు. అలాగే సిబ్బంది మోపిదేవికు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు.