Home » Pending bills
అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది, సర్కారు కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు.
రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కొన్ని విభాగాల్లో నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. అసలే అరకొర జీతాలు.. అవీ నెలనెలా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని వారు వాపోతున్నారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పింఛన్ల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ మేరకు పింఛన్ల కోసం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులపై మంత్రి సీతక్క ఆరా తీశారు.
సర్కారు బడుల్లో నెలకొన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. అసలు సమస్యలే లేవన్నట్లుగా విద్యా శాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వాస్తవాలను మరుగున పెడితే ఎలా..? అని ప్రశ్నించారు.
తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.
‘‘గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని సొంతంగా లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించాం. పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఆదేశాలతో.. పల్లె ప్రగతి పేరుతో నిర్మాణాలు చేపట్టాం.
ధరణి పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగులో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పలు అందడంలేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్ కావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు బిల్లుల చెల్లింపు జరగడంలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకూ చెల్లింపుల్లేవు.