Home » Sitaram Yechury
వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. వామపక్షాల అగ్రనేతలు, నాయకులు, వేలాది కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొని, అణగారినవర్గాల కోసం జీవితాంతం పోరాడిన ఎర్రసూరీడు ఏచూరికి చివరి వీడ్కోలు పలికారు.
Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సీపీఎంలో ఏ కార్యక్రమం జరిగినా సీతారాం ఏచూరి ఉండేవారన్నారు. సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమన్నారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజాన చౌదరి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలను నమ్ముకుని జీవితమంతా దేశం కోసం కష్టపడ్డారన్నారు. ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించి..
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియనుంది. మరికాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరబాద్కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. నిన్న (శుక్రవారం) రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు.
జవహలాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)కు చెందిన వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి శుక్రవారం ఘన నివాళి అర్పించారు.
పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.
దేశం గర్వించదగ్గ నేత సీతారాం ఏచూరి అని జిల్లా మోటార్ వర్క్స్ యూనియన అధ్యక్షుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్ అన్నారు.
సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సీతారాం ఏచూరి నివాసానికి బయలుదేరారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఎవరిని వరించనుంది. రేసులో ఎవరెవరు ఉన్నారు. ఏచూరి ఆకస్మిక మరణంతో సీపీఎం నియమావళిలో మార్పులు చేస్తారా..? లేదంటే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారా..?
Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లోనే ఉంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు వసంత్కుంజ్లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 8:00 గంటలకు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం తరలించనున్నారు.