Home » Sonia Gandhi
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్ఎ్సను వీడి కాంగ్రె్సలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పారు.
ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.
రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి, రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ‘కట్-ఆ్ఫ-డేట్’గా నిర్ణయించింది.
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్’లో ఉంచింది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సోమవారం ఢిల్లీలో కలిశారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబరు 9న సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలంగాణ తల్లి ఉత్సవం’ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.