Home » Sri Satyasai
శ్రీ సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం, గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు సర్వాంగ సుందరంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ముస్తాబైంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి ప్రశాంతి నియానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వచ్చారు.
Andhrapradesh: వైసీపీ అధిష్టానంపై కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మండిపడ్డారు. ప్రాణాలు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మోసం చేసిందంటూ సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు.
Andhrapradesh: జిల్లాలోని కదిరిలో కౌన్సిల్ మీట్ వాడీవేడీగా సాగింది. మున్సిపాలిటీలో అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. డీజిల్ పేరుతో రెండు కోట్లు నిధులు స్వాహా చేశారని తెలిపిన వైసీపీ కౌన్సిలర్ తెలిపారు. భూ కబ్జాలపై కౌన్సిల్ సభ్యులు నిలదీశారు.
నియోజకవర్గంలో విష సంస్కృతిని విడనాడాలని టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శుక్రవారం అమరాపురం మండలం గొల్లమారనపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజునాథ్ అనే రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి మొక్కలను పెరికి వేశారు. ఎకరా పొలంలో క్రాస్ పత్తి మొక్కలను పెరికి వేశారని, రూ.6లక్షల వరకు న ష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్న వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొందని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్కు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.