Home » Warangal
ఆస్తి తగాదాల విషయంలో మనవళ్ల చేతిలో ఓ వృద్ధుడు హత్యకు గురైన సంఘటన ఆదివారం హనుమకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జవ్వాజీ సురేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తికి చెందిన జల్లి సారయ్య (80) పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు జల్లి రమేశ్, జల్లి అశోక్, ఒక కూతురు తిరుమల ఉన్నారు.
ఈ నెల 9న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.
నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు పలు అక్రమాలకు కేంద్రంగా మారింది. రింగ్ రోడ్డు ప్రాంతం నిర్మానుషంగా ఉండటంతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్చగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రధానంగా కేయూ, హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ ఆర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.
హనుమకొండ: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రాత్మకమని, 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రజాప్రతినిధులు లేరని, అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందని వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎప్సెట్ ఫలితాల్లో టాప్-10 ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులు సమానంగా పంచుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రి-ఫార్మసీ విభాగాల్లోని తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులకు ఐదేసి ర్యాంకులు దక్కాయి.అయితే, రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో
కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ తాటికొండ రమే్షపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల నుంచి టెర్మినేట్ చేసిన బోధనా సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు గతంలో అనేకసార్లు ఆరోపించారు.
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్ఎ్సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎ్సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.