Home » West Bengal
ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు...
ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తమ్లూక్ బీజేపీ అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు?’ అని ప్రశ్నించారు. బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల ప్రచారంలో అభిజిత్ గంగోపాధ్యాయ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమి విషయంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రె్సతో వచ్చిన విభేదాల వల్ల ‘ఇండియా’కు దూరంగా ఉన్న ఆమె బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు.
విపక్ష 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమ మద్దతుపై స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారతదేశం సార్వభౌమాధికారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. పీఓకే ఇండియాకు చెందినదని, దానిని వెనక్కి తెచ్చుకుంటామని అన్నారు. పశ్చిమబెంగాల్లోని సెరంపోర్లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాల తీరును ఆయన ఎండగట్టారు.
లోక్సభ ఎన్నికల్లో మోదీ ఇప్పటికే 270 సీట్లు గెలిచినట్టు తాను చెప్పగలనని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 400కు పైగా సీట్లలో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో తాము పోరాడుతున్నామని పశ్చిమబెంగాల్లోని బాంగావ్లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చెప్పారు.
లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బర్దమాన్-దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కల్నా గేట్లో బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది.
ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి దివగంత హీరాబెన్ పటేల్తో మోదీ ఉన్న రెండు చిత్తరువులను అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజ్భవన్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ పై వచ్చిన ఆరోపణల వ్యవహారం ముదురుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఎదురుదాడికి దిగారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని శనివారంనాడు నిలదీశారు.