Home » YuvaGalam
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) చేసిన తప్పులకు వదిలిపెట్టమని...చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు.
Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.
సీఎం జగన్కి (CM Jagan) స్టార్టప్ అంటే తెలియదని.. ఆయనకి తెలిసింది ఒక్కటేనని దోచుకో... దాచుకోవడమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. ఆర్థిక వనరులు పెంచుతామని హామీ ఇచ్చారు. కియా కంపెనీతో అనంతపురం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Lokesh Sankharavam: వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.
Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ‘యువగళం నవశకం’ విజయవంతంగా ముగిసింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరిగిన ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తోపాటు ఇరు పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని.. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశానంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.