AP News: మంగళవారం విజయవాడ దుర్గగుడి ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2022-10-24T19:43:54+05:30 IST

Vijayawada: మంగళవారం విజయవాడ దుర్గగుడి ఆలయం మూసివేయనున్నారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ప్రధానాలయంతోపాటు ఉపాలయాల తలుపులు మూసివేయనున్నారు.

 AP News: మంగళవారం విజయవాడ దుర్గగుడి ఆలయం మూసివేత

Vijayawada: రేపు విజయవాడ దుర్గగుడి ఆలయం మూసివేయనున్నారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ప్రధానాలయంతోపాటు ఉపాలయాల తలుపులు మూసివేయనున్నారు. 25వ తేదీ ఉదయం 11 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకాలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Updated Date - 2022-10-24T23:48:26+05:30 IST