వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి షర్మిల తన సొంత అన్న అని చూడకకుండా జగన్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏపీసీసీ చీఫ్ హోదా చేపట్టాక.. తన మాటలకు మరింత పదును పెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సొంత అన్నపైనే షర్మిల ఎదురుదాడికి దిగారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్కు గుడ్బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కంప్యూటర్ల కొనుగోల్మాల్ వ్యవహారాలపై అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోల్మాల్ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన.. అక్కరకు రాని పంట నష్టపరిహారం.. అడ్డదిడ్డంగా ప్రధాన కాల్వలు, డ్రెయిన్లు.. తీవ్రమైన సాగు, తాగునీటి ఎద్దడి.. పట్టించుకునేవారు లేరు. పరిష్కరించే నాథుడు రాడు. దీంతో ఐదేళ్ల తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి
దుర్గగుడిలో వారిద్దరి స్టైలే వేరు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని రోజులైనా కాసులు కురిపించే కీలక స్థానాలను మాత్రం వారు వదలరంటే వదలరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, విజిలెన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిద్దరినీ పక్కన పెట్టేవారే ఉండరు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టులను ఏరికోరుకుని మరీ ఎంచుకుని కూర్చుంటారు. వీరిలో ఒకరి ఉద్యోగ నియామకంలోనే వివాదాలున్నా.. మరొకరిని ఏసీబీ కేసులు వెంటాడుతున్నా.. తాజాగా జరిగిన దుర్గగుడి అంతర్గత బదిలీల్లో ప్రాధాన్యమైన పోస్టులు కల్పించడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల దోపిడీని అరిక ట్టాలని రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య కోరారు.
Adhra Pradesh: పెడన నియోజకవర్గంలో ఇంకా జోగి రమేశ్ హవా కొనసాగుతోందా? నియోజకవర్గంలో ఆయన చేసిన భూదందాలు, అసైన్డ్, ప్రభుత్వ భూముల స్వాధీనంలో జరిగిన అక్రమాలు బయటపడకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారా? పెడన నుంచి పెనమలూరు వెళ్లినా, ఆయనకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్న కీలక వ్యక్తులు, అధికారులు ఎవరు? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఐదేళ్లుగా జోగి రమేశ్ చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకు, తనకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వైద్యులు, ఆస్పత్రులపై దాడుల నుంచి రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) డిమాండ్ చేసింది.
కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఎం ఆరోపించింది. అన్యాయంపై పోరాడేం దుకు టీడీపీ ముందుకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.