Home » Andhra Pradesh » Krishna
బెంజిసర్కిల్ సమీపంలో మచిలీపట్నం వెళ్లే వైపు బందరు రోడ్డులో నిర్మించిన బస్షెల్టర్ను అందంగా, ఆకర్షణీ యంగా నిర్మించినా, లోపలికి వెళ్లడానికి మెట్లు ఏర్పాటు చేయలేదు. వ
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడింది.
‘‘కొడాలి నాని ఓటర్లకు పంపిన డబ్బును 10, 11, 12వ వార్డులకు చెందిన వైసీపీ మైనార్టీ నాయ కులు దోచేశారు. రూ.7 కోట్లు తీసుకున్నారు. వారిని కల్యాణమండపానికి పిలిపించి నిజాలను తెలుసుకో అన్నా. లేకపోతే మండపంలోని కుక్కలను వారి మీదకు వదిలెయ్. లేదంటే ఆ డబ్బులతో గోవా, మలేషియా, సింగపూర్ చెక్కేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’’ కొడాలి నాని ముఖ్య అనుచరుడు, మైనార్టీ నాయకుడు సర్దార్ బేగ్ సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలివి. గత రెండు రోజులుగా సెల్ఫీ వీడియో వైరల్ అవుతున్నా వైసీపీ నాయకులు ఖండించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
వారు నిరుపేదలు. ఏరోజుకారోజు కూలి చేసుకుని పొట్టపోసుకునే దళిత దంపతులు. కష్టంలోనూ, సుఖంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండే ఆలూమగలు. వారిని విద్యుత్ రూపంలో మృత్యువు కాటేసింది. ప్రమాదవశాత్తూ భార్యకు కరెంటు షాక్ తగలడంతో ఆమెను కాపాడబోయిన భర్త కూడా షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
గన్నవరం, గుడివాడలో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని మెజారిటీ 15వేలు పైచిలుకు వస్తుందని విజయ వాడకు చెందిన ఓ బిల్డర్ రూ.5 లక్షలకు బెట్టింగ్ కాశారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్కు అవనిగడ్డలో మెజారిటీ వస్తుందని మచిలీపట్నంకు చెందిన ఓ రోల్డు గోల్డు వ్యాపారి రూ.10 లక్షలు బెట్టింగ్ కాశారు. ఈయనే మచిలీపట్నం ఎంపీగా కూటమి అభ్యర్థి బాలశౌరి గెలుస్తారని మరో రూ.10 లక్షలు పందెం కాశారు. ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో కొన్ని రోజులుగా సైలెంట్ అయిన బెట్టింగ్ రాయుళ్లు మళ్లీ బరిలోకి దిగారు. పోలింగ్ ముగిసిన వెంటనే రెండు మూడు రోజులు జోరుగా మొదలైన బెట్టింగ్లు మధ్యలో కాస్త తగ్గాయి. ఫలితాలు తేలే రోజు దగ్గరపడుతుండటంతో మళ్లీ బెట్టింగ్ బాబులు జూలు విదులుస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్లు నడుస్తున్నాయి.
నేటి రాజకీయాలకు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శనీయుడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంక టేశ్వరరావు అన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుంద రయ్య వర్ధంతి సభ ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో టీవీ లక్ష్మణస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎర్ర జెండాతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
మండలంలోని బెల్టు షాపుల్లో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. పెనమలూరులో ఏ మూల వెతికినా మద్యం చిటికెలో లభిస్తోంది. పెనమలూరు వంతెన, తాడిగడప పాతవంతెన, పోరంకి సెంటరు, యనమలకుదురు లాకులు, సాలిపేట, పోరంకి స్మశానం రోడ్డు, కామయ్యతోపు సెంటరు తదితర ప్రాంతాల్లో మద్యం బెల్టు షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసిన వెంటనే బెల్టు షాపుల నిర్వాహకులు నడిరోడ్డుపైనే మొబైల్ మద్యం దుకాణాలకు తెరలేపుతున్నారు.
శాంతి యుతంగా ఉండే గన్నవరం నియోజకవర్గంలో అక్రమ కేసుల సంస్కృతితో పాటు భౌతికదాడులు చేయడం హేయమైన చర్యని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగన్నగూడెంలో టీడీపీ నాయకుడు ఆళ్ల గోపాలకృష్ణను ఆదివారం ఆయన పరామర్శించారు.
అవనిగడ్డ, (కృష్ణాజిల్లా): అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్కు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్.. రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు.
కృష్ణాజిల్లా, గుడివాడ: ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.