VARLA RAMAIAH : ప్రతిపక్ష నేత భద్రతను పట్టించుకోరా?: వర్ల

ABN , First Publish Date - 2022-11-06T04:37:19+05:30 IST

జగన్‌రెడ్డి పర్యటనకు ముందస్తు అరెస్టులు చేస్తూ, పరదాలు కప్పుతున్న పోలీసులు.. ప్రతిపక్ష నాయకుడి పర్యటన గురించి పట్టించుకోరా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘‘పూలల్లో రాయి వచ్చిందని విజయవాడ సీపీ చెప్పడం హాస్యాస్పం. దాడి ఎవరి ప్రోద్భలంతో జరిగిందో నిగ్గు తేల్చాలి’’ అని డిమాండ్‌ చేశారు.

VARLA RAMAIAH : ప్రతిపక్ష నేత భద్రతను పట్టించుకోరా?: వర్ల
VARLA RAMAIAH

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి పర్యటనకు ముందస్తు అరెస్టులు చేస్తూ, పరదాలు కప్పుతున్న పోలీసులు.. ప్రతిపక్ష నాయకుడి పర్యటన గురించి పట్టించుకోరా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘‘పూలల్లో రాయి వచ్చిందని విజయవాడ సీపీ చెప్పడం హాస్యాస్పం. దాడి ఎవరి ప్రోద్భలంతో జరిగిందో నిగ్గు తేల్చాలి’’ అని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై నందిగామలో జరిగిన దాడి జగన్‌ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ఠ అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించాలన్నారు. నందిగామలో కరెంటు తీసేసి, చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేయించడాన్ని చూస్తే జగన్‌రెడ్డి ఎంతగా భయపడుతున్నాడో అర్థమౌతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా ‘‘కరెంటు కట్‌ చేసి, రాళ్లు వేయిస్తావా? ప్రజాదరణ చూసి భయపడ్డావా జగన్‌రెడ్డీ? ఆయన బాంబులకే భయపడలేదు.. రాళ్లకి భయపడతారా? బులుగు ఫెల్లోస్‌ ఖబడ్డార్‌’’ అని హెచ్చరిస్తూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-11-06T04:37:20+05:30 IST