Balakrishna: 109 దర్శకుడు అతనే!

ABN , First Publish Date - 2022-10-31T18:35:46+05:30 IST

‘వీరసింహారెడ్డి’, ‘ఎన్‌బీకె 108’ చిత్రాల తర్వాత బాలకృష్ణ సినిమా ఎవరితో అన్నది ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న టాపిక్‌. దీనికి తెరపడే జవాబు ఇచ్చారు బాలకృష్ణ. ఎన్‌బీకె 109 పరశురామ్‌ దర్శకత్వంలో ఉండబోతోందని ఆయనే స్వయంగా ప్రకటించారు.

Balakrishna: 109 దర్శకుడు అతనే!

‘వీరసింహారెడ్డి’(Veerasimha reddy), ‘ఎన్‌బీకె 108’(Nbk 108) చిత్రాల తర్వాత బాలకృష్ణ సినిమా ఎవరితో అన్నది ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న టాపిక్‌. దీనికి తెరపడే జవాబు ఇచ్చారు బాలకృష్ణ. ఎన్‌బీకె 109 (Nbk 109) పరశురామ్‌ (Director parasuram)దర్శకత్వంలో ఉండబోతోందని ఆయనే స్వయంగా ప్రకటించారు. అల్లు శిరీష్‌ (Allu sirish) హీరోగా నటించిన ‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ అతిథిగా హాజరయ్యారు. అక్కడ జరిగిన సరదా సంభాషణలో అల్లు శిరీష్‌ బాలయ్యను ‘మీ తదుపరి చిత్రంలో నటించే అవకాశం ఇస్తారా? మీ పక్కన నుంచి డైలాగ్‌  చెప్పే సీన్‌ ఉంటే చాలు’ అని అడిగాడు. దీనికి సమాధానంగా బాలకృష్ణ ‘నెక్ట్స్‌ పరశురామ్‌ సినిమాలో ట్రై చేద్దాం. క్యారెక్టర్‌ ఏంటనేది సిట్టింగ్‌లో ప్లాన్‌ చేద్దాం’’ అని అన్నారు. దీనిని బట్టి బాలయ్య తదుపరి చిత్రం పరశురామ్‌తో ఉంటుందని తెలుస్తోంది. ఇదే వేదికపై ఉన్న పరశురామ్‌ కూడా బాలయ్యను పరశురామ్‌ మాట్లాడుతూ ’’సార్‌.. త్వరలోనే ఓ కథతో మిమ్మల్ని కలుస్తా. ఈ విషయం అల్లు అరవింద్‌ గారికి కూడా తెలుసు’’ అని చెప్పారు. అంటే పరశురామ్‌, బాలయ్యల చిత్రం అల్లు అరవింద్‌ నిర్మించే అవకాశం ఉంది. 

‘గీత గోవిందం’తో సూపర్‌హిట్‌ అందుకున్న పరశురామ్‌ మహేశ్‌ని డెరెక్ట్‌ చేసే అవకాశం అందకుని ‘సర్కారు వారి పాట’ చిత్రం తీశాడు. దాని తర్వాత పరశురామ్‌ మరో సినిమా కమిట్‌ కాలేదు. నాగచైతన్యతో ఓ సినిమా అనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు. అలాగే గీతా ఆర్ట్స్‌లో ఇప్పటికే ఓ సినిమాకు అడ్వాన్స్‌ తీసుకున్నారు పరశురామ్‌. సో.. ఆ సంస్థకు ఓ సినిమా చేయాల్సి ఉంది. అతని దగ్గర కథ ఉంది కానీ, హీరోలు ఖాళీగా లేరు. అయితే ఇప్పుడు పరశురామ్‌ దృష్టి బాలయ్యపై పడిందనే టాక్‌ నడుస్తోంది. 


Updated Date - 2022-10-31T18:35:47+05:30 IST