DK Aruna: దాడికి పాల్పడ్డ గద్వాల్ ఎమ్మెల్యే‌పై కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-11-22T18:48:46+05:30 IST

Jogulamba Gadwal Dist: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల నియోజకవర్గం‌లోని బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన దాడి ఘటనపై

DK Aruna: దాడికి పాల్పడ్డ గద్వాల్ ఎమ్మెల్యే‌పై కేసు నమోదు చేయాలి

Jogulamba Gadwal Dist: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల నియోజకవర్గం‌లోని బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన దాడి ఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ మధ్య ఉన్న విభేదాల కారణంగా బాధ్యతాయుత ప్రిన్సిపాల్‌పై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంటనే ప్రిన్సిపాల్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే‌పై పోలీసులు కేసు నమోదు చేయకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అసలు ఏం జరిగిందంటే..

గద్వాల జిల్లాలో బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి(Bandla Krishnamohan Reddy), జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా (ZP Chairperson Sarita)ను అధికారులు ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే పాఠశాలను జడ్పీ ఛైర్‌పర్సన్ ప్రారంభించారు. నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక.. ప్రిన్సిపాల్ గల్లా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో మిగతా అధికారులు ఖంగుతిన్నారు. ఈ ఘటనతో జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది.

Updated Date - 2022-11-22T18:48:47+05:30 IST