Home » BJP
పోలింగ్ బూత్లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగే దశ ఇదే.
దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటన్నారు.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్పై బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్పై ఇప్పటి వరకు దాఖలు చేసిన నోటీసుల గురించి కోర్టు..
శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయకూడదంటూ విద్యార్థులకు చెప్పిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేసినట్టు బిహార్ రాష్ట్ర అధికారులు తెలిపారు. ముజఫర్నగర్ జిల్లా కుర్హానీ సమితి అమ్రఖ్లోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న హరేంద్ర రజక్పై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు.
లోక్సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన హామీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని, ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడి కళ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.