ఏపీలో 7.7 శాతం నిరుద్యోగం: నాగబాబు
ABN , First Publish Date - 2023-11-29T04:41:56+05:30 IST
యువతే దేశానికి వెన్నెముక అంటారని, అలాంటి యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వ హయాంలో నాశనమైందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): యువతే దేశానికి వెన్నెముక అంటారని, అలాంటి యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వ హయాంలో నాశనమైందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 22 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని తెలిపారు. 2018లో 4శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు 7.7 శాతానికి పెరిగిందని, ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యధికమని తెలిపారు.