Share News

బీసీల అనైక్యత ఆసరాగా వైసీపీ దాడులు: కొల్లు

ABN , First Publish Date - 2023-11-29T04:41:01+05:30 IST

బీసీల అనైక్యతను ఆసరా చేసుకుని వైసీపీ పాలనలో అణచివేతలు, దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

బీసీల అనైక్యత ఆసరాగా వైసీపీ దాడులు: కొల్లు

గుంటూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బీసీల అనైక్యతను ఆసరా చేసుకుని వైసీపీ పాలనలో అణచివేతలు, దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘బీసీల పట్ల ప్రభుత్వ నమ్మక ద్రోహం’ పేరిట గుంటూరులోని ఎన్జీవో కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ బీసీల అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్య శక్తిగా నిలబడి వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపుతామని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-29T04:41:20+05:30 IST