Nagotu Ramesh Naidu: వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే..

ABN , First Publish Date - 2023-07-08T19:23:33+05:30 IST

వైసీపీ అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

Nagotu Ramesh Naidu: వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే..

అమరావతి: వైసీపీ(YCP) అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు(Nagotu Ramesh Naidu) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి లొంగపరచుకోవాలనుకోవడం వైసీపీకి అలవాటైపోయిందని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం రాజు అనే మా కార్యకర్త చెయని తప్పులను రుద్ధి రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారన్నారు. మర్డర్ కేసులు నమోదు చేసి జైల్‌కు బందీల్లాగా తీసుకెళ్లి కొడుతున్నారని నాగోతు రమేష్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.


మా కార్యకర్త జైల్లులో గడిపే ప్రతి నిమిషం మీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని గుర్తుంచుపెట్టుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నామని సంకలు గుద్దుకోకండి.. అదేవిధంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని రాబోయే రోజుల్లో చెంప చెళ్లుమనే విధంగా సమాధానం చెబుతామని, మీరు ఊసలు లెక్కపెట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని నాగోతు రమేష్ నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-07-08T20:21:11+05:30 IST