Share News

‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను విజయవంతం చేద్దాం...

ABN , First Publish Date - 2023-11-27T21:51:09+05:30 IST

: ఆడుదాం ఆంధ్ర క్రీడలను విజయవంతం చేద్దామని మండల ప్రత్యేక అధికారిణి పరిమళ అధికారులను కోరారు. సోమవారం బోగోలు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దారు హేమంత్‌ కుమార్‌, ఎంపీడీవో వెంకట

‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను విజయవంతం చేద్దాం...
1బిటిటిఆర్‌27 : నమోదును పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారిని పరిమళ

బిట్రగుంట, నవంబరు 27: ఆడుదాం ఆంధ్ర క్రీడలను విజయవంతం చేద్దామని మండల ప్రత్యేక అధికారిణి పరిమళ అధికారులను కోరారు. సోమవారం బోగోలు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దారు హేమంత్‌ కుమార్‌, ఎంపీడీవో వెంకటసుబ్బారావు, ఎంఈవో నరసింహరావు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో ఐదు క్రీడలకు సంబంధించి 20 జట్లు ఉండాలన్నారు. క్రీడాకారుల పేర్లు, వయసు, ఆడే ఆట వివరాలను సచివాలయలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. అనంతరం విశ్వనాథరావుపేట సచివాలయంలో జరుగుతున్న క్రీడాకారుల పేర్ల నమోదును ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T21:51:10+05:30 IST