ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వాలని ధర్నా
ABN , First Publish Date - 2023-11-27T21:43:26+05:30 IST
గిరిజన, దళిత యువతకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చేందుకు బోగోలులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లి పేర్కొన్నారు. సోమవారం దళితులు ఆర్డీవో కార్యాల
కావలి,నవంబరు27: గిరిజన, దళిత యువతకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చేందుకు బోగోలులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లి పేర్కొన్నారు. సోమవారం దళితులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డీవో శీనానాయక్కు వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దళిత యువతకు మోటారు వైండింగ్, హౌస్వైరింగ్, సెల్పోన్ రిపేరింగ్, బ్యూటీ పార్లల్, కుట్టుశిక్షణ, డిజైన్ టెక్నాలజీ, ఆటో, స్కూటర్ రిపేరింగ్ల నైపుణ్యంపై శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ కేంద్రాన్ని నిర్మించారని, వైసీపీ పాలకులు దాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ఈ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి, యువతకు శిక్షణ ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో దళిత, గిరిజన నేతలు జరుగుమల్లి విజయరత్నం, లక్ష్మీనర్సయ్య, జెడ్డా వాసు, ముక్కు మోహన్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.