Vangaveeti Radha : రంగాను కులం, మంతం పార్టీలకు అతీతంగా అంతా గుండెల్లో పెట్టుకున్నారు

ABN , First Publish Date - 2023-07-04T11:48:16+05:30 IST

వంగవీటి మోహనరంగా 76వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జనసేన నేతలు పోతిన వెంకట మహేష్, రామకృష్ణ, అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Vangaveeti Radha : రంగాను కులం, మంతం పార్టీలకు అతీతంగా అంతా గుండెల్లో పెట్టుకున్నారు

విజయవాడ : వంగవీటి మోహనరంగా 76వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జనసేన నేతలు పోతిన వెంకట మహేష్, రామకృష్ణ, అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి రాధా రంగ మిత్ర మండలి సభ్యులు కు తినిపించిన వంగవీటి రాధాకృష్ణ తినిపించారు.

ఈ సందర్భంగా.. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి రంగాను కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఒక మనిషి భౌతికంగా దూరమైనా కొన్ని తరాలకు స్ఫూర్తి ఇచ్చారు. నేటికీ రంగాను దేవుడిగా ఆదరించడం .. ఆయన చేసిన మంచిని చెబుతుంది. భవిష్యత్తులో రంగా అభిమానులు అందరూ ఐకమత్యం చూపాలి. రంగా పేరు చెప్పుకుని నాయకులుగా కొందరు ఎదిగారు. వారు పట్టించుకోక పోయినా.. ప్రజల మనసుల్లో రంగా ఉన్నారు. రంగా పేరు చెప్పుకునే పాలకులే ఆయన పేరు జిల్లాకు ఎందుకు పెట్టలేదో‌ చెప్పాలి. 1987లో మా నాన్న చైతన్య రథం సినిమా నిర్మించారు. అభిమానులు ఎంతోకాలంగా ఆ సినిమా కోసం ఎదురు‌ చూస్తున్నారు. ఒక ప్రింట్ దొరికితే దానిని సరి చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించాం. ఈ రోజు రంగా జయంతి సందర్భంగా దానిని అమెరికాలో రిలీజ్ చేశారు. సాంకేతిక అంశాలు పూర్తి చేసుకుని త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెస్తాం. లాభాపేక్ష లేకుండా సోషల్ మీడియాలో ఉచితంగా సినిమాను అందరూ చూసేలా చేస్తాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-07-04T11:48:16+05:30 IST