Home » Andhra Pradesh
రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ ఎప్ సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం అధికారిక నివాసం1 జనపథ్కు వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో చదువుతున్న తమ కుమార్తెకు పీజు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ కన్న తండ్రి ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన.. తన వ్యక్తిగత నగదును ఆ విద్యార్థిని చదువు కోసం చెక్కు రూపంలో అందజేశారు.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!
‘దమ్ముంటే అసెంబ్లీ కి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఏపీ సీఎం నారా చద్రబాబు నాయడు (AP CM Nara Chadrababu Naidu) సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు.