Viveka case: పులివెందులకు క్షేమంగా చేరుకున్న వాచ్‌మెన్ రంగన్న

ABN , First Publish Date - 2023-05-07T15:05:53+05:30 IST

మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న (Watchman Ranganna)ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

Viveka case: పులివెందులకు క్షేమంగా చేరుకున్న వాచ్‌మెన్ రంగన్న

కడప: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న (Watchman Ranganna)ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. రంగన్న కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 2న ఆస్తమాతో బాధపడుతున్న రంగన్నను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ తరలించారు. ఆ తర్వాత తిరుపతి నుంచి హైదరాబాద్‌ (Hyderabad)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం రంగన్న క్షేమంగా పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు. వివేకా హత్య కేసులో రంగన్న రెండేళ్ల క్రితం మేజిస్టేట్ ముందు కీలక వాంగ్మూలం ఇచ్చారు. ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పిస్తున్నారు.

ప్రస్తుతం వివేకా కేసు కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రత్యక్ష సాక్షి రంగన్న అనారోగ్యానికి గురికావడం చర్చనీయాంశమైంది. రంగన్నను ఆసుపత్రుల చుట్టు తిప్పడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వివేకా హత్యలో రంగన్న కీలక సాక్షిగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకను హత్య చేశారని 164 స్టేట్‌మెంట్‌‌లో రంగన్న చెప్పారు. ఈ కేసులో ఏ 1 నిందిుతుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తన ప్రాణాలకు హాని ఉందని దస్తగిరి పదేపదే చెబుతున్నాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగన్నను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి రంగన్నను వైద్యం పేరుతో చంపేస్తారని పులివెందుల (Pulivendula)లో చర్చ నడిచింది.

Updated Date - 2023-05-07T15:10:22+05:30 IST