Home » Hyderabad
వందల కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపై మాజీ కలెక్టర్, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో రోజు గురువారం విచారించనుంది.
నగరంలో చెట్ల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టానికి పదును పెడుతున్నారు. చెట్టే కదా అని కొట్టేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న పేరు మోసిన ఇద్దరు రౌడీషీటర్ల ఆటకట్టించారు సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు(Southzone Task Force Police) బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా దక్షిణమధ్య రైల్వే(South Central Railway) పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా.. తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
దీపావళికి ముందే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణకొరియా రాజధాని సియోల్లో హాన్ నది పునరుజ్జీవనంపై అధ్యయనానికి వెళ్లిన పొంగులేటి అక్కడ ఓ తెలుగు చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నదమ్ముల మధ్య కోట్లాది రూపాయల ఆస్తి వివాదంలో ఓ ఏసీపీ(ACP) తలదూర్చి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర కమిషనరేట్(City Commissionerate)లోని వెస్ట్జోన్ పరిధి వీఐపీ డివిజన్లో పనిచేస్తున్న సదరు ఏసీపీకి మంచి విందు ఇవ్వడంతోపాటు అడ్వాన్స్గా కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తాం అని చెప్పామని... చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీ కబంధహస్తాల నుంచి కేంద్రంలోని ఎన్ఐసికి అప్పగిస్తున్నామన్నారు. 2024 కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, 15 దేశాల్లోని మంచి రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశామని చెప్పారు.
సుందరీకరణలో భాగంగా లోయర్ ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ జీహెచ్ఎంసీ ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమైంది.
అమెరికాకు చెందిన థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ‘బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ (బీడీసీ)’ను నెలకొల్పబోతోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కారు అంచనాలకు, వస్తున్న రాబడులకు పొంతన ఉండడం లేదు.