Home » Hyderabad
అతనో స్వీపర్.. ఆఫీసును శుభ్రపరచడమే పని..! కానీ పనిచేయకున్నా.. అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి, నెలకు తీసుకునే జీతం రూ.2 లక్షలు..! కారణం.. జీఎస్టీ రీఫండ్ కోసం అతణ్ని డైరెక్టర్గా చూపించడమే..! అతనొక్కడే కాదు.. ఆఫీ్సబాయ్, హౌస్కీపింగ్లో పనిచేసే ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం..!
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.
రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో కాపాడుకొని, ఈ ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎ్స)తో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ)తో పరీక్షలు చేయించడంతో పా టు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు.
ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు దీరారు.
పోలీస్ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అటకెక్కింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయుధాలు అందజేయాలని కోరింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ఈ నెల 9న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.