బాబు ప్రజల్లో తిరిగితే మీకొచ్చిన నష్టమేంటి?: రఘురామ
ABN , First Publish Date - 2023-11-29T04:37:22+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
![బాబు ప్రజల్లో తిరిగితే మీకొచ్చిన నష్టమేంటి?: రఘురామ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్కడ ఉన్నా తమకు ఒకటేనని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొంటుండగా, మరొకవైపు ఆయన్ని ప్రజల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం అభ్యర్థించడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం రఘురామ మాట్లాడుతూ ప్రజల్లోకి చంద్రబాబును వెళ్లనివ్వొద్దని కోరడానికి భయమే కారణం కదా అని ప్రశ్నించారు. బాబు ప్రజల్లోకి వెళితే... ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి, ఆయన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని, స్కిల్ కేసులో పూర్తిస్థాయి బెయిల్ పొందిన చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లడం ఖాయమన్నారు.